ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పథకాలను తీసుకువస్తున్న చంద్రబాబు సర్కార్.. తాజాగా ఇంకో పథకం గురించి ప్రకటన చేసింది. త్వరలోనే ఏపీలో చేనేత కుటుంబాలకు ఆదుకునేందుకు నేతన్న భరోసా పథకాన్ని తీసుకురానున్నట్లు తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది.