ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని వారికి ట్యాబ్లు ఇవ్వనుంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం నెల్లూరులో మెప్మా మహిళలు, అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని స్వయం సహాయక సభ్యులకు 9000 ట్యాబ్లు అందించనున్నట్లు తెలిపారు. అలాగే విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.