AP Govt Rs 4 Lakhs Lightning Victims Compensation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి, పిడుగుపాటుతో చనిపోయిన వారి కుటుంబాలకి అండగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. పిడుగుపాటుకు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేసింది. పంట నష్టం అంచనా వేసి, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే రైతులందరికీ సాయం అందుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.