ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమి లేని మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమరావతిలో భూమి లేని సుమారు 19 వేల మందికి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత రూ.2500గా ఉన్న ఈ పింఛన్లను ఆ తర్వాత రూ.5000లకు పెంచారు. తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.