Amaravati Farmers gets Loans with out Link Documents: రాజధాని రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీపికబురు వినిపించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు లింక్ డాక్యుమెంట్లు లేకుండానే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు, సీఆర్డీఏ ఇచ్చిన డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శనివారం భేటీ అయ్యింది.