AP Govt Free Three Wheelers To Disabled: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తోంది. త్వరలోనే 1,750 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు, విశాఖపట్నంలో రూ.200 కోట్లతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, ఉచిత త్రీవీలర్స్, పెన్షన్లు, రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.