Ap Govt Released Rs 3220 Crores To Complete PMAY Houses: ఏపీ ప్రభుత్వం పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజనుల ఇంటి నిర్మాణాలకు అదనంగా రూ.3,220 కోట్లు సాయం అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులు అందజేస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అందుతున్న రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులు(పీవీటీజీ)కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.