విద్యార్థుల చదువుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తపాలా శాఖ స్కాలర్షిప్ అందిస్తోంది. దీన్ దయాల్ స్పర్శ్ యోజన పేరుతో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.6000 ఉపకార వేతనం అందిస్తోంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్మెంట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు దరఖాస్తు గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తపాలా శాఖ అధికారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీతో గడువు ముగుస్తుందని తెలిపారు.