Amaravati New Bits pilani Campus: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చేందుకు పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటు కాగా.. తాజాగా ప్రఖ్యాత విద్యా సంస్థ బిట్స్ పిలానీ తన నూతన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. మందడం, వెంకటపాలెం గ్రామాల రెవెన్యూ పరిధిలో.. 70.011 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏతో భూ విక్రయ ఒప్పందం జరిగింది. రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ యూనివర్శిటీకి గోవా, హైదరాబాద్, దుబాయ్లో క్యాంపస్లు ఉన్నాయి.