AP Govt Released Tribal Students Scholarship Money: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్ డబ్బులు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ బకాయిలను కూడా తీర్చింది. అంతేకాకుండా, రోడ్ల మరమ్మత్తులకు రూ.205.12 కోట్లు, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు రూ.33.60 కోట్లు కేటాయించింది. ఈ మేరకు అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.