Andhra Pradesh Muslim Students Free Education Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్దమైంది.ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత శిక్షణ ఇచ్చే పథకాన్ని అమలు చేయనుంది. ముందుగా టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తారు. అలాగే వక్ఫ్ భూములను అభివృద్ధి చేసేందుకు డెవలపర్లను ఆహ్వానించారు.. వాణిజ్య ప్రయోజనాలకు వక్ఫ్ భూములను ఉయోగిస్తారు.