Andhra Pradesh School Students Free Books Re Open Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పాఠశాలలు తిరిగి తెరిచే రోజే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు పుస్తకాల ముద్రణ, పంపిణీ వేగంగా జరుగుతోంది. బరువు తగ్గించేందుకు రెండు సెమిస్టర్లకు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. అలాగే, యూనిఫామ్, షూస్, బ్యాగ్తో కూడిన కిట్ను కూడా ఉచితంగా అందజేయనున్నారు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే వీటిని విద్యార్థులకు అందజేస్తారు.