Andhra Pradesh 9 Days Free Power For Ganesh Mandapams: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు, పందిళ్లకు ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. 9 రోజుల పాటూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవచ్చు. ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.