Andhra Pradesh Government Launched Green Shops: ఏపీలో గ్రామాల్లో స్వచ్ఛత కోసం ఫ్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ షాపులు ఏర్పాటు చేసి పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్, తదితర వస్తువుల కొనుగోళ్లు చేపట్టింది.. వాటికి బదులుగా నిత్యావసరాల పంపిణీ చేస్తోంది. ముందుగా తిరుపతి, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ రథాలు తిరగని ప్రాంతాల్లో దశలవారీగా షాపుల ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.