Andhra Pradesh High Temperatures Today: ఏపీలో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వేడిగాలులు వీస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 35 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.