Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం ఉచితంగా కిట్లు అందించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్లో విద్యార్థులకు బ్యాగులు, బూట్లు, బెల్టులు, యూనిఫాం క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. పాఠ్యపుస్తకాల టెండర్లను పాఠశాల విద్యాశాఖ విడిగా చేపట్టింది. ఈ టెండర్ల ద్వారా రూ.63.79 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.