ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు వెసలుబాటు కల్పించింది. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాల నుంచి గంట ముందుగానే వెళ్లేలా వెసలుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2 నుంచి మార్చి 30 వరకూ ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.