Prakasam District Ganesh Laddu Rs 30 Lakhs: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపంలో లడ్డూ, కలశం వేలం పాట నిర్వహించగా, ఊహించని ధర పలికింది. పాలుగుళ్ల మోహన్రెడ్డి అనే వ్యక్తి లడ్డూను రూ.30 లక్షలకు, ముత్యాల నారాయణరెడ్డి కలశాన్ని రూ.19.10 లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.