ఆంధ్రప్రదేశ్కు మరోసారి వర్ష సూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపారు. రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఆయా జిల్లాల్లో కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని సూచించారు. ఇక పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకునేందుకు దామిని యాప్ను ఉపయోగించుకోవాలని అధికారులు హితవు పలికారు.