ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలలో వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. పలు జిల్లాలలో వర్షాలతో పాటుగా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశువుల కాపర్లు , పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.