రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు సీఎం చంద్రబాబు కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తేవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మూడు చోట్ల సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నారు. 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నారు.