ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తోంది. పీఎం - ఈ బస్ సేవా పథకం కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనాభా వారీగా ఈ బస్సులను డిపోలకు అందించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకోసం మూడు లక్షల జనాభా పైగా ఉన్న పట్టణాల నుంచి ప్రతిపాదనలు కోరింది. అందులో భాగంగా మచిలీపట్నం, గుడివాడకు 95 ఎలక్ట్రిక్ బస్సులు కావాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.