Sullurpeta Railway Station Inauguration: దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ ఈ నెల 22న ప్రారంభించనున్నారు. రూ.12.77 కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లను కూడా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ లోగా పనులు పూర్తి కాకపోతే జేసీబీతో కూల్చేస్తానని హెచ్చరించారు.