ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్స్లో తెలంగాణ విద్యార్థులకు కొనసాగుతున్న 67 శాతం లోకల్ కోటాను రద్దు చేయవద్దని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్కు ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఆయన కేంద్ర మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు, అలాగే స్వయంగా కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. తెలంగాణకు కొత్త సైనిక్ స్కూల్స్ మంజూరు చేసే వరకు కోటా కొనసాగించాలని కోరారు.