Chittoor District Roads: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. చిత్తూరు జిల్లాలో 221 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.72 కోట్లు కేటాయించగా, కుప్పం నియోజకవర్గానికే రూ.54 కోట్లు కేటాయించడం విశేషం. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుపడతాయని, రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.