Andhra Pradesh Bird Flu Chicken: ఏపీలో వరుసగా కోళ్లు చనిపోతున్నాయి.. దీంతో ఫౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో చనిపోయిన కోళ్లను భోపాల్ ల్యాబ్కు పంపించగా టెస్టులు చేసి రిపోర్టుల్ని పంపించారు. ఆ టెస్టుల్లో కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (హెచ్5ఎన్1 -బర్డ్ ఫ్లూ) వైరస్ కారణమని తేలింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలు, రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు.