రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, పలు జిల్లాల్లో 41 నుంచి 43.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగాల్పుల నేపథ్యంలో.. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.