ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు శుభవార్త వినిపించింది. టిడ్కో ఇళ్లను దసరాకు లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని మంత్రి మండిపడ్డారు. అయితే ఎంత ఖర్చైనా సరే మహిళలకు టిడ్కో ఇళ్లు అందించాలనే చంద్రబాబు ఆదేశాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసినట్లు వివరించారు. దసరాకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని.. గృహప్రవేశాలు చేయిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగ విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు.