ఏపీలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. పెండింగ్ ఇళ్లను సంక్రాంతి నాటికి అందజేస్తామని ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. సంక్రాంతికి గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. వైసీపీ చర్యల కారణంగానే టిడ్కో ఇళ్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని.. లబ్ధిదారులు బ్యాంక్ వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే గృహప్రవేశాలు జరిగిన చోట మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.