రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ బర్లీ రకం పొగాకును చివరి ఆకు వరకూ కొనేవరకూ అండగా ఉంటామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శనివారం పొగాకు రైతులు, కంపెనీల ప్రతినిధులతో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలని పొగాకు కంపెనీల ప్రతినిధులకు అచ్చెన్నాయుడు సూచించారు.