Andhra Pradesh ration distribution June 2025: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ జరుగుతుందని వెల్లడించారు. జూన్ నుంచి రేషన్ వ్యాన్లు ఉండవని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నిర్వహణ భారం కారణంగానే ఎండీయూ వాహనాలను తప్పించినట్లు తెలుస్తోంది.