ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బోగస్ రేషన్ కార్డులు ఏరివేసేందుకు సర్వే చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రేషన్ కార్డులు అనర్హులకు కూడా అందాయని భావిస్తున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో రేషన్ కార్డులపై సర్వే చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు మే నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తు్న్న సంగతి తెలిసిందే.