Ration cards latest news in Andhra Pradesh: ఏపీలోని రేషన్కార్డుదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ వినిపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఒకేసారి రెండు శుభవార్తలు వినిపించారు. రేషన్ కార్డుదారులకు నూనె, కందిపప్పు, గోధుమపిండి, రాగులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే రేషన్ సరుకులు నెల మొత్తం అందుబాటులో ఉండేలా చూస్తామంటూ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ రెండు నిర్ణయాలు అమల్లోకి వస్తే ఏపీలోని రేషన్ కార్డుదారులకు.. నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసలుబాటు లభిస్తుంది.