CM Chandrababu 15000 To Auto Drivers under Vahanamitra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించింది. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దసరా రోజున రూ.15000 అందిస్తామని ప్రకటించారు. అలాగే రెండున్నర లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామంటూ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించింది.