Chandrababu Review on Health Department: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట నిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, చికిత్సలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించింది. ఏపీ వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.