విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన సస్పెండ్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది.