ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఆర్మూరు-జగిత్యాల-మంచిర్యాల హైవే నిర్మాణానికి ప్రధానమంత్రి కార్యాలయం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిచి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. NH 63 ను నాలుగు లేన్లుగా విస్తరించనుండగా, పట్టణాలు, గ్రామాల వద్ద బైపాస్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు కానుంది.