మూసీ సుందరీకరణలో భూమి కోల్పోయిన వ్యక్తికి ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయకపోతే రెండు వారాల జైలు శిక్ష తప్పదని అర్వింద్ కుమార్, ప్రసూనాంబలను హెచ్చరించింది. అంతేకాకుండా, జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బాధితుడికి న్యాయం చేయాలనే ఉద్దేశం లేని అధికారుల తీరును కోర్టు తప్పుబట్టింది. పూర్తి వివరాలు..