ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా సీఎంను కలవడానికి పడిగాపులు

1 year ago 20
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలవడానికి ప్రయత్నిస్తుంటే అపాయింట్‌మెంట్ దొరకలేదని సోషల్ మీడియాలో ఓ వైరల్ తెగ వైరల్ అవుతోంది. ‘‘నేను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.. ప్రజా సమస్యల గురించి సీఎం రేవంత్‌రెడ్డిని కలవాలని నాలుగుసార్లు ప్రయత్నించాను.. అయినా ఫలితం లేకపోయింది’’ అంటూ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే వాపోవడం వీడియోలో ఉంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రయత్నించానని, తెలిసిన నేతలు, అధికారులకు ఫోన్‌ చేస్తే రమ్మంటున్నారు కానీ, సీఎంను కలిసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదన్నారు.. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలను ఆయనకు విన్నవించాలని ప్రయత్నిస్తున్నానని, ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారని ఆయన వాపోయారు.
Read Entire Article