Pratap Reddy Rs 2.85 Crore Golden Crowns To Vontimitta Temple: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడికి ప్రముఖ వ్యాపారవేత్త పీ ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మీరెడ్డి దంపతులు బంగారు కిరీటాలను కానుకగా అందజేశారు. మొత్తం మూడు బంగారు కిరీటాలు ఉండగా.. వీటి విలువ సుమారు రూ.2.85 కోట్లు ఉంటుంది. ఈ కిరీటాలను డిప్యూటీ ఈవో శివప్రసాద్కు దాతలు అప్పగించారు. ఈ మూడు కిరీటాలను 2.24 కిలోలో బంగారంతో తయారు చేయించారు.