సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసంతో అమాయకులను నిండా ముంచుతున్నారు. తాజాగా ఈ మెయిల్స్లోని లెటర్లు మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కంపెనీ పేరులోని ఒక్క అక్షరం మార్చి అక్షరాల రూ.10 కోట్లు కొట్టేశారు. దీంతో బాధిత కంపెనీ పోలీసులను ఆశ్రయించింది.