సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఒక చిన్న కాలనీ కులాల కుమ్ములాటలతో వార్తల్లో నిలిచింది. మొదట వినాయక నగర్గా ఐక్యంగా ఉన్న కాలనీ, ఆ తర్వాత కులాల ఆధిపత్యంతో విడిపోయింది. కేవలం 25 ఇళ్లు ఉన్న ఆ కాలనీ ఇప్పుడు రెడ్డి, ఆర్యవైశ్య, యాదవ, ముదిరాజ్, విశ్వకర్మ ఎన్క్లేవ్లుగా పలు పేర్లతో దర్శనమిస్తోంది. ఈ కుల పిచ్చి ఎక్కడికి పోతుందో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.