ఆలయాల్లో దర్శనం కోసం వెళ్లినా.. మెట్రో ప్రయాణం, పర్యాటక ప్రాంతాలకు వెళ్లినా సరే.. టికెట్ కోసం క్యూలైన్లో నిలబడాల్సిందే. రద్దీ ఎక్కువగా ఉంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం మీటికెట్ అంటూ ఓ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, జూపార్క్, మ్యూజియాల్లోకి వెళ్లాలంటే క్యూ లైన్లో నిల్చునే అవసరం లేకుండానే.. టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు..