యాదాద్రి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒక్క రాత్రిలో జ్యూవెలరీ షాపుతో సహా పది ఇళ్లలో చొరబడి 2 కిలోల వెండి, రూ. 86 వేల నగదును ఎత్తుకెళ్లారు. కొల్లూరు, ఆలేరు, మాటూరు గ్రామాల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఒకేసారి ఇన్ని చోట్ల దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకపోవడం.. సోషల్ మీడియాలో తాము ఊరికి వెళ్తున్నట్లు లేదా ఇంట్లో ఎవరూ లేరనే విషయాలను పోస్ట్ చేయకపోవడం సురక్షితమని పోలీసులు సూచిస్తున్నారు.