సన్నాలకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతులు ఉత్సాహంగా వానాకాలంలో సాగు ప్రారంభించారు. గతంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా 48 వేల ఎకరాల్లో సాగుచేసిన సన్నాలు.. ఈసారి రెట్టింపైన విస్తీర్ణంలో నాట్లుపెట్టారు. వానాకాలం సన్నాలు నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో మంచి ధర దక్కుతుంది. వర్షాలు సమృద్ధిగా పడటంతో దిగుబడి 25 లక్షల క్వింటాళ్లకు చేరుకోనున్నదని అంచనా. ఒక్కో రైతు రెండు ఎకరాల్లో పంట వేస్తే సుమారు రూ.25 వేల అదనపు ఆదాయం పొందనున్నారు.