హైదరాబాద్లోని సకలం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా సరే.. ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు. పేద ముస్లిం మహిళలకు ఉచిత విద్యను అందిస్తున్నందున సామాజిక కారణాలతోనే కూల్చివేత నిలిపివేశామని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంఐఎం నేతలపై బండి సంజయ్ వంటి బీజేపీ నాయకుల విమర్శల నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.