ఒవైసీ సోదరులపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఫాతిమా విద్యాసంస్థలు చెరువు ఎఫ్టీఎల్ భూమిలో నిర్మించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు సైలెంట్గా ఉంటోందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతుతోనే ఓవైసీ ధైర్యంగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని.. ఫాతిమా విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.