మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. 25 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో తన కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గత కొంతకాలంగా తల్లిని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. ఈ కేసులో పూర్తి వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.