అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. భర్త కష్టపడి సంపాదించిన డబ్బులనే సుపారీగా ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటన దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రైవాడ పంచాయతీలోని శ్రీరామపురంలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.