బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ ఘడ్ మీదుగా పయనిస్తున్నట్లు తెలిపింది. వాయుగుండం ప్రభావంతో సోమవారం రోజున ఏపీలోని కొన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.